సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన...
సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన
విశాఖపట్నంలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు నగరం,కల్లూరు చెన్నమ్మ సర్కిల్ లో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రా మిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రజానాట్యమండలి క ళాకారులు అనేక జానపద పాటలు,నృత్యాలు,నాటికలు ప్రదర్శించారు.
ఇందులో సిఐటియు జిందాబాద్,వివిధ రకాల పాటలు ఆలపించారు.అదేవిదంగా ఓ భా ర్య,ఓ భర్త,ఓ అది నాటిక ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో ప్రజానా ట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు,అధ్యక్షులు బసవరాజు,కళాకారులు సుంకన్న,సుబ్బ రాయుడు,నోమేశ్వరి,లక్ష్మి,సరిత,డాన్స్ మాస్టర్ రాము,ఇతర కళాకారులు,సిపిఏం న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు,సిఐటియు నగర అధ్యక్షులు డి.నగేష్,కార్యదర్శి నరసింహు లు,సిఐటియు నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment