జేఈఈ మెయిన్స్ లో సత్త చాటిన పుట్ట గురు హర్షిత్

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

జేఈఈ ఫలితాల్లో భాగంగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నంద్యాల జిల్లా, గడివేముల మండలం,దుర్వేసి గ్రామానికి చెందిన పుట్ట గురుహర్షిత్  అలిండియా 144వ ర్యాంక్ ( స్కోరు 99.99) ర్యాంకును సాధించారు.దుర్వేశి గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు పుట్ట గురు వెంకటరమణ,విజయలక్ష్మి దంపతుల కుమారుడు.పుట్టగురు హర్షిత్,ప్రస్తుతం విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఎంపిసిలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసి స్తున్నారు.

ఈ క్రమంలో చదువుపై ఆసక్తి ఏకాగ్రతతో చదివి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిం డియా స్థాయిలో 144(99.99)ర్యాంకు సాధించి శభాష్ అనిపించు కున్నారు.జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం తో  ఆ ప్రాంత ప్రజలు,మిత్రులు,శ్రేయోభిలాషులు ఆ నందం వ్యక్తం చేస్తూ హర్షిత్ కు అభినందనలు తెలి పారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...