బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతాం...మంత్రి లోకేష్
బెట్టింగ్ యాప్లపై ఏపీ మంత్రి నారాలోకేష్ స్పందించారు.బెట్టింగ్ యాప్ల వలన జీవి తాలు నాశనం అవుతున్నాయని తనకు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎక్స్లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు."బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయి.జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారని నేను వందలా ది హృదయ విదారక ఘటనలు వింటున్నాను.ఇది ఆపాలి.దీర్ఘకాలిక పరిష్కారం ఏమి టంటే నిరంతర అవగాహన,ఇంకా...బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడం.మొ త్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తు న్నాం.ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని సదరు పోస్టులో మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Comments
Post a Comment